Home » AP పాలటిక్స్ న్యూస్
You are browsing entries filed in “AP పాలటిక్స్ న్యూస్”

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుధవారం ఝలక్ ఇచ్చారు. తెలంగాణ కోసమంటూ ఇక నుండి ఎవరూ రాజీనామా చేయవద్దని, అలా చేస్తే భవిష్యత్తులో తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రస్తుతం రాజీనామా చేసిన వారు తెలంగాణ కోసమే చేశారనే అభిప్రాయం [...]
February 22nd, 2012 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »

‘నా పేరు నరసింహన్’ అంటూ గవర్నర్ మరోసారి తన సత్తా చాటారు. సర్కారుకు షాక్ ఇచ్చారు. నిబంధనలు అంగీకరించవంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యుడి నియామకం, సెర్చి కమిటీల ఏర్పాటు ఫైళ్లను తిప్పి పంపినట్లే…. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపైనా ‘ఎర్ర ఇంకు’ పెట్టారు. ఇటీవల ఎనిమిదిని కమిషనర్లుగా ఎంపిక చేయగా… వారిలో నలుగురు ఈ పదవులకు అర్హులు కాదంటూ గవర్నర్ నరసింహన్ ఫైలును తిప్పి పంపారు. తాంతియా కుమారి, ముత్తంశెట్టి విజయ నిర్మల, వర్రె [...]
February 22nd, 2012 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాడోపేడో తేల్చుకోవాలని ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్ణయించుకున్నారు. మద్యం ముడుపుల ఆరోపణల సుడిలో ఇరుక్కున్న తనకు సీఎం రక్షణగా నిలిస్తే సరి! ఈ ముడుపులతో తనకు సంబంధం లేదని ‘సభ సాక్షి’గా క్లీన్ చిట్ ఇస్తే సరేసరి! లేని పక్షంలో పదవికి, పార్టీకి గుడ్బై చెప్పాలని మోపిదేవి భావిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్, ఫిబ్రవరి21 : అప్పుడు ఖమ్మం మద్యం సిండికేట్ లీడర్ నున్న వెంకటరమణ రిమాండ్ రిపోర్టులో తన పేరు [...]
February 22nd, 2012 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »
మద్యం సిండికేట్లలో కాంగ్రెసు నాయకులు ఎవరెవరున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జిల్లాకో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మద్యం సిండికేట్లలో ఎసిబి దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులను ఆ యంత్రాంగం సేకరించి, చంద్రబాబుకు పంపుతోంది. ఒక్కో జిల్లాలోని యంత్రాంగంలో ఆరుగురేసి సభ్యులుంటారు. రిమాండ్ రిపోర్టులను తెప్పించుకుని కాంగ్రెసు నాయకులు, మంత్రులు, శాసనసభ్యుల పేర్లను వెలికి తీసి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యుద్ధం ప్రకటించాలని ఆయన అనుకుంటున్నారు. అయితే, దాదాపు డజను మంది [...]
February 21st, 2012 | Posted in AP పాలటిక్స్ న్యూస్ | Read More »
ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇవ్వడానికే బిజెపి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పోటీ నుంచి విరమించుకోవాలని తెరాస నాయకత్వం చేస్తున్న విజ్ఞప్తులకు బిజెపి లొంగడం లేదు. మంగళవారంనాడు బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో తెరాస శాసనసభ్యులు ఈటెల రాజేందర్, హరీష్ రావు తదితరులు మాట్లాడారు. వారి విజ్ఞప్తిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. తమ క్యాడర్ను నిలుపుకోవడానికి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమని బిజెపి [...]
February 21st, 2012 | Posted in AP పాలటిక్స్ న్యూస్ | Read More »

తన సోదరుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు ప్రధాన శత్రువు అని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ నేత వైయస్ వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసుకు ప్రధాన శత్రువులు తెలుగుదేశం, జగన్ పార్టీలేనని ఆయన స్పష్టం చేశారు. తాము జగన్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. తాను అధిష్టానాన్ని రాజ్యసభ సీటు [...]
February 21st, 2012 | Posted in AP పాలటిక్స్ న్యూస్ | Read More »

లక్నో: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బుధవారం బహుజన్ సమాజ్ వాది, సమాజ్ వాది పార్టీల వాగ్ధానాలను చిత్తు కాగితంతో పోలుస్తూ చించి వేశారు. లక్నో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఓ కాగితం చించేశారు. ముఖ్యమంత్రి మాయావతి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ల వాగ్ధానాలను రాహుల్ చిత్తు కాగితంతో పోల్చారు. విద్యుత్తు, నీరు, ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగభృతి ఇస్తామని వాగ్ధానాలు చేయడం పేపరు మీద రాతల్లాంటివేనంటూ విపక్షాలపై విరుచుకు [...]
February 16th, 2012 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »

హైదరాబాద్: మద్యం సిండికేట్ వ్యవహారంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, తన వాళ్లకు మద్యం దుకాణాలు ఉన్నాయని ప్రకటించిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలే లక్ష్యంగా అసెంబ్లీలో దాడి చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పార్టీ శాసనసభ్యులతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెండు విడతలుగా భేటీ అయ్యారు. మద్యం ముడుపులు, ఎసిబి దాడుల పైనే మొదటగా దృష్టి కేంద్రీకరించాలని ఆయన నిర్ణయించారు. [...]
February 14th, 2012 | Posted in AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ పాలన భేష్గా ఉందని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో ప్రశంసల వర్షం కురిపించాడు. 35 నిమిషాల పాటు గవర్నర్ ప్రసగం జరిగింది. ప్రసంగం సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తుండటంతో తన ప్రసంగాన్ని గవర్నర్ జెట్ స్పీడ్తో ముగించారు. బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. [...]
February 13th, 2012 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వేసిన పిటిషన్కు సుప్రీం కోర్టులో సోమవారం నిరాశ ఎదురైంది. అదే సమయంలో ఎమ్మార్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాలన్న పిటిషన్కు కోర్టు తోసి పుచ్చింది. సోమవారం ఒకేరోజు సుప్రీం కోర్టు ముందుకు మూడు పిటిషన్లు వచ్చాయి. ఎమ్మార్ పైన సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు తీర్పును నిలిపి [...]
February 13th, 2012 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »